యూపీ నుంచి బిహార్ కు వచ్చి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని గాజీపూర్ జిల్లాకు చెందిన రెండేళ్ల బాలుడు తన మేనమామ వివాహానికి హాజరయ్యేందుకు తల్లితో కలిసి బిహార్ లోని లాలాపూర్ ప్రాంతంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. జనవరి 22న ఇంటి బయట ఆడుకుంటుండగా బాలుడు కనిపించకుండా పోయాడని అతని మేనమామ అజయ్ పాల్ కుద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అనుమానితుల వివరాలు తెలిశాయి. మున్నీ కున్వర్, ఆమె కుమారుడు అవినాష్ కుమార్, అతని స్నేహితుడు అంకిత్ కుమార్, లక్ష్మీనా దేవి, ఆమె కుమారుడు పరాస్నాథ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేశారు.