కార్డుల జారీకి బ్రేకులు..
ఈ నేపథ్యంలో.. జాబ్ కార్డుల్లో సవరణలకు కూడా డిమాండ్ పెరిగింది. తండ్రి పేరుపై భూమి ఉంటే.. అతని పేరు తొలగించి.. మిగతావారి పేరుమీదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు.. కొత్త జాబ్ కార్డుల జారీ, సవరణలు, తొలగింపులకు బ్రేక్ వేశారు.