జనవరి 27న ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జనవరి 27న డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు. ప్రపంచ శాంతి, ద్వైపాక్షిక భద్రత కోసం కలిసి పనిచేయడం, సాంకేతికత, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందించే చర్యలపై ఇరువురు నేతలు టెలిఫోన్ సంభాషణలో చర్చించారు. ‘పరస్పర ప్రయోజనకరమైన, నమ్మకమైన భాగస్వామ్యానికి మేం కట్టుబడి ఉన్నాం. మన ప్రజల సంక్షేమం కోసం, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, భద్రత కోసం మేము కలిసి పనిచేస్తాము” అని ప్రధాని మోదీ అన్నారు.