బీఆర్ఎస్కు ఆయుధంగా..
మల్లన్న చేసిన ఈ కామెంట్స్.. బీఆర్ఎస్కు ఆయుధంగా మారాయి. కలగణన నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్లన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. సొంత పార్టీ వారే ఈ సర్వేను తప్పుబడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన సర్వేనే ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కూడా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. మల్లన్నకు నోటీసులు ఇచ్చింది.