వాట్సాప్లో కొత్త ఫీచర్..
వాట్సాప్ ఓనర్ మెటా.. భారతదేశంలో తన ఆర్థిక సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యుటిలిటీ బిల్లుల పేమెంట్ ఆప్షన్ని సైతం యాప్లో తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం. ఆండ్రాయిడ్ అథారిటీ ప్రకారం, వాట్సాప్ ఇప్పటికే వినియోగదారులను యూపీఐ ద్వారా కాంటాక్ట్స్, వ్యాపారాలకు డబ్బు పంపడానికి అనుమతిస్తుంది. ఇన్స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం త్వరలో వివిధ కేటగిరీలకు పేమెంట్శ్ని ప్రవేశపెట్టవచ్చు. వీటిలో కరెంట్ బిల్లులు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్లు, ఎల్పీజీ గ్యాస్ పేమెంట్స్, వాటర్ బిల్లులు, ల్యాండ్లైన్ పోస్ట్పెయిడ్ బిల్లులు, అద్దె చెల్లింపులు కూడా ఉండవచ్చు.