ఫుడ్ బాస్కెట్ గా ఏపీ
గత 30 ఏళ్లుగా తెచ్చిన పాలసీలు, ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించాయో చర్చించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ నాయకుడి వల్ల ప్రజలకు, రాష్ట్రానికి న్యాయం జరిగిందో చర్చ జరగాలన్నారు. పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఏపీ రైతులు చాలా తెలివైనవాళ్లని, చెబితే చాలు అల్లుకుపోతారన్నారు. సాగునీరు పుష్కలంగా ఉన్న అనేకచోట్లకు రైతులు వెళ్లారన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు మంచి ధర వస్తోంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా మారే శక్తి ఏపీకి ఉందన్నారు.