గట్టిగా ఇరుక్కున్న రాజ్, కావ్య
దాంతో రుద్రాణికి సపోర్ట్ చేసిన ధాన్యలక్ష్మీ అనామికను చెప్పమని అంటుంది. రాజ్, కావ్యలు కలిసి రూ. 100 కోట్లు అప్పు చేశారు అని అనామిక అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఇదే దుగ్గిరాల ఇంట్లో అనామిక పేల్చిన పెద్ద బాంబ్. సీతారామయ్య ఇచ్చిన షూరిటీని అడ్డుగా పెట్టుకుని రాజ్, కావ్యను అప్పు చేసినట్లుగా అబద్ధం చెబుతుంది అనామిక. అది అబద్ధం అని రాజ్, కావ్య వాదించలేక, సీతారామయ్య షూరిటీ, ఇల్లు తాకట్టు వంటి విషయాలు చెప్పలేకుండా గట్టిగా ఇరికించేసింది అనామిక.