భోజనం తినలేకపోతున్నాం
విద్యార్థులు తమ సమస్యలను ప్రిన్సిపల్కు వివరించారు. తాగు నీరు పరిశుభ్రంగా ఉండటం లేదని, మెనూ ప్రకారం కాకుండా, కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా సరఫరా చేసే కూరగాయలతో వండి పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ముందు రోజు సాయంత్రం ఉడకబెట్టిన దుంపలు, కూరగాయలనే మరుసటి రోజు పెడుతున్నారని పేర్కొన్నారు. ఆ భోజనం తినలేకపోతున్నామని తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఈ విషయం హాస్టల్ చీఫ్ వార్డెన్కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. రీసెర్చ్ స్కాలర్స్తో సమావేశం పెట్టాలని కోరినప్పటికీ వార్డెన్ స్పందించలేదని, గత్యంతరం లేక ఆందోళన చేస్తున్నామని తెలిపారు.