భీష్మ ద్వాదశి.. ఈ రోజున చేసే పూజల వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్మకం. అందుకే ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, విష్ణువు, సూర్యభగవానుడిని పూజిస్తారు. భీష్మ పితామహుడికి నువ్వులు, నీరు, కుశతో తర్పణం చేస్తారు. బ్రాహ్మణులకు ఆహారం, దక్షిణను నైవేద్యం పెడతారు. అంతేకాదు.. పూర్వీకులను కూడా పూజిస్తారు. ఈ రోజున పూజలు చేయడం వల్ల.. వ్యక్తి బాధలు తొలగిపోతాయని, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అలాగే.. ఈ రోజున భీష్మ కథ వినాలని పెద్దలు చెబుతారు.