అధికారులు చుట్టూ తిరుగుతున్న రైతులు…
ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించింది. మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టర్ ను కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నది నిజమే, ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాధానం ఇచ్చారు. బహిరంగ మార్కెట్ లో 2,800 రూపాయల నుండి 3,000 రూపాయల ధర పలుకుతున్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి దాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.