మధ్యప్రదేశ్ ‘ధార్ గ్యాంగ్’ పలు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. 18 రోజుల క్రితం నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఈ చోరి ధార్‌ గ్యాంగ్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అనంతపురం ఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో జల్లెడపట్టారు. చివరికి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here