వేల కోట్లకు పైగా నష్టం
పైరసీ కారణంగా ప్రతి ఏడాది వినోద రంగానికి రూ.20 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని 2023లో ఓ నివేదిక తెలిపింది. సినిమా నిర్మాణానికి పడిన కష్టం పైరసీ వల్ల వృథాగా పోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైరసీని అడ్డుకోవడానికి కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖలో నోడల్ ఆఫీసర్స్ను నియమించారు. అలాగే ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం 1952లో సవరణలు చేసి, కొత్త బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. ముంబయిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో, ప్రాంతీయ కార్యాలయాల్లో పైరసీ, డిజిటల్ పైరసీల ఫిర్యాదులను స్వీకరిస్తారు.