ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు..
కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఏయే శాఖలకు ఎంత నిధులు కేటాయించాలన్న అంశాలపై చర్చలు జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా జలవనరుల శాఖకు సంబంధించి ఎంత నిధులు అవసరమో మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక శాఖకు వివరించారు. హంద్రినివా, వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల వంశధారా, గాలేరు- నగరి తోపాటు.. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రామానాయుడు కోరినట్టు సమాచారం. అటు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నుంచి నిధులు వస్తాయన్న అంచనాతో దీనికి కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది.