Vijayawada Metro : మెట్రో రైలు.. విజయవాడ వాసుల కల. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ.. దీనిపై ఊరిస్తూనే ఉన్నారు. గతంలో అదిగో.. ఇదిగో అంటూ ప్రకటనలు ఇచ్చారు. తాజాగా.. మెట్రో కల సాకారానికి తొలి అడుగు పడింది. భూసేకరణ ప్రతిపాదనలను ఏపీఎంఆర్సీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.