టీమ్ఇండియా ప్రిన్స్ శుభ్ మన్ గిల్ అదరగొడుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ ఓపెనర్ బుధవారం (ఫిబ్రవరి 12) ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హోం గ్రౌండ్ అహ్మదాబాద్ లో జట్టును నడిపించే గిల్.. ఇప్పుడు అదే స్టేడియంలో తొలి వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ కింగ్ కోహ్లి ఫిఫ్టీతో ఫామ్ లోకి వచ్చాడు.