ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ గ్రాండ్ గా బోణీ కొట్టింది. చైనా లో జరుగుతున్న ఈ టోర్నీలో శుభారంభం చేసింది. గోల్డ్ దిశగా తొలి అడుగు ఘనంగా వేసింది. బుధవారం (ఫిబ్రవరి 12) గ్రూప్-డి మ్యాచ్ లో భారత్ 5-0 తేడాతో మకావును చిత్తుచిత్తుగా ఓడించింది. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించింది.