2024 నవంబర్ నుంచే..
యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద నమోదైన ఫిర్యాదు ప్రకారం 2024 నవంబర్లో ర్యాగింగ్ ప్రారంభమైందని, అప్పటి నుంచి ర్యాగింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థులు ఇచ్చిన పిర్యాదు ప్రకారం.. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. వారు జూనియర్ విద్యార్థులను నగ్నంగా నిలబడమని బలవంతం చేసి, ఆపై వ్యాయామంలో ఉపయోగించే డంబెల్స్ ను వారి ప్రైవేట్ భాగాలకు వేలాడ దీసేవారు. థర్డ్ ఇయర్ విద్యార్థులు కంపాస్ లు, ఇతర వస్తువులను ఉపయోగించి తమను తీవ్రంగా గాయపర్చారని విద్యార్థులు ఆరోపించారు. ఆ తర్వాత ఆ గాయాల నొప్పిని పెంచడానికి వాటిపై లోషన్ పూయమని బలవంతం చేసేవారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ వేధింపుల గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని సీనియర్లు బెదిరించారు. అంతేకాదు, జూనియర్ విద్యార్థుల నుంచి సీనియర్లు తరచూ డబ్బులు వసూలు చేసేవారని, ఆదివారం మద్యం కొనుగోలు చేసేందుకు జూనియర్ల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకునేవారని బాధిత విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు.