కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ నరేందర్ రెడ్డి, బీజేపి అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి, బిఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి సర్దార్ రవీందర్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ నుంచి లట్టు చంద్రశేఖర్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి దొడ్ల వెంకటేశం, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి బక్క జడ్సన్, ధర్మ సమాజ్ పార్టీ నుంచి మంద జ్యోతి, తెలంగాణ ద్రావిడ ప్రజల పార్టీ నుంచి బొల్లి సుభాష్, నేషనల్ నవ క్రాంతి పార్టీ నుంచి సిలువేరి ఇంద్ర గౌడ్ తో పాటు 58 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు సరిగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు.