తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుండగా… ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కారు పార్టీ… ప్రస్తుతం పోటీకి ఎందుకు దూరంగా ఉంటోందన్న చర్చ జోరుగా జరుగుతోంది.