చల్లటి నీరు:
థ్రెడింగ్ తర్వాత చర్మ ఎర్రగా మారడం, చికాకు, నొప్పి, మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. తర్వాత ఐస్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకోసం కొన్ని ఐస్ ముక్కలను తీసుకుని గుడ్డలో చుట్టి ప్రభావిత ప్రాంతంలో 15 నిమిషాల పాటు అప్లై చేయండి. ఇది చాలా త్వరగా నొప్పి, మంటను తగ్గిస్తుంది. చర్మం ఎర్రబడటాన్ని తగ్గిస్తుంది.