కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. అధికార టీడీపీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకనుగుణంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపింది. అయితే ఈ ఎన్నికలు అధికార కూటమికి సవాల్గా మారాయి. అందుకే గెలుపు కోసం గత ఐదు నెలలుగా కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.