ఎమ్మెల్యే ఫిర్యాదుతో..
సత్యం ఫిర్యాదుతో.. 339/2024, భారతీయ న్యాయ సంహిత 308, 351(3), (4) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఎమ్మెల్యేను బెదిరించిన వ్యక్తి గురించి ఆరా తీశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్లోని భవానినగర్కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని గుర్తించారు. అతడు లండన్ నుంచి బెదిరింపులకు పాల్పడ్డాడని తేలింది. నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు.