ఈ ఏడాది జనవరి 12న బీసీసీఐ స్పెషల్ ఏజీఎం తర్వాత ఐపీఎల్ 2025 మార్చి 23న ఆరంభమవుతుందని వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హింట్ ఇచ్చాడు. కానీ ఒక రోజు ముందుగానే కొత్త సీజన్ ఆరంభమయ్యే అవకాశముంది.ఇప్పటికే షెడ్యూల్ కు సంబంధించిన సమాచారం ఆయా ఫ్రాంఛైజీలకు చేరిందని తెలిసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్ ల వేదికలు కూడా ఖరారయ్యాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో.. క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ లు కోల్ కతా లో జరగబోతున్నాయి.