పూర్ణ ప్రదాన పాత్రలో పి19 ట్రాన్స్మీడియా స్టూడియోస్ పతాకంపై పటోళ్ళ వెంకట్రెడ్డి సమర్పణలో సురేష్రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’. ఈ చిత్రానికి జి.ఆర్.ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ సరసన త్రిగుణ్(ఆదిత్ అరుణ్) నటించగా, విధార్థ్, సుభాశ్రీ రాయగురు మిగతా ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్కి సిద్ధమైంది. కాగా, శుక్రవారం దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ను సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘సురేష్రెడ్డిగారు మా ప్రాంతం నుండి వచ్చి నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు డార్క్ నైట్ చిత్రంతో పరిచయం అయ్యారు. చాలా సంతోషం. ప్రస్తుతం థ్రిల్లర్ కథా చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. పి19 ట్రాన్స్మీడియా స్టూడియోస్ బ్యానర్లో తొలి చిత్రంగా పూర్ణ, త్రిగుణ్ మెయిన్ లీడ్గా వస్తున్న డార్క్ నైట్ తప్పక విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత సురేష్రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ ‘మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు వినాయక్గారికి ధన్యవాదాలు. తెలుగులో ఎమోషనల్ థ్రిల్లర్గా వచ్చిన ‘అవును’, ‘అవును2’ చిత్రాలలో పూర్ణ నటన అద్భుతంగా ఉంటుంది. ఆ చిత్రాలతోనే ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రాలకు అతీతంగా డార్క్ నైట్లో ఆమె నటన హైలెట్గా నిలుస్తుంది. మళ్లీ ఇన్నాళ్ళకు ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు అనుగుణంగా ఎమోషనల్గా సాగే థ్రిల్లర్ కథతో ‘డార్క్ నైట్’ చిత్రం నిర్మించాం. తమిళ్ రచయిత, దర్శకుడు జి.ఆర్.ఆదిత్యా ఈ చిత్రాన్ని ఆద్యంతం అధ్బుతంగా ఊహించని ట్విస్ట్లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విదంగా మలిచారు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనాన్ని అందించారు. అన్ని విధాల ఎమోషనల్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది ‘డార్క్ నైట్’ చిత్రం. అంతేకాదు, చివరి వరకు ప్రేక్షకుల్ని సీట్లకు కట్టిపడేసే విధంగా సన్నివేశాలు వుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్గా ఎమోషనల్ రోలర్ కోస్టర్లో రన్ అవుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మిస్కిన్ సిగ్నేచర్ బిజిఎంతో స్వరపరిచిన నేపథ్య సంగీతంతో థ్రిల్లింగ్ విజువల్స్కు ఊపిరి పోసాడు. ప్రస్తుతం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి రెండోవారంలోగానీ, మూడో వారంలోగానీ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.