కొత్త ఇంఛార్జ్ నేపథ్యం….
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత NSUIలోకి ఎంట్రీ చేశారు. 1999–2002 వరకు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అంతేకాకుండా 2002-2005 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపికయ్యారు.