చాలా దేశాల జనాభా కన్నా ఎక్కువ
మహా కుంభమేళాలో పాల్గొన్నవారి సంఖ్య భారత్, చైనా మినహా మిగతా అన్ని దేశాల జనాభాను మించిపోయిందని యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ సనాతన ధర్మ పవిత్ర జలాల్లో స్నానం ఆచరించిన వారి కంటే తక్కువ జనాభాను కలిగి ఉన్నాయని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి ఐదు దేశాలు వరుసగా భారతదేశం, చైనా, యుఎస్, ఇండోనేషియా, పాకిస్తాన్. అమెరికాలో 34.20 కోట్లు, ఇండోనేషియాలో 28.36 కోట్ల మంది నివసిస్తున్నారు. పాకిస్తాన్ జనాభా సుమారు 25.70 కోట్లు. ఇది మహా కుంభమేళాకు హాజరైనవారిలో దాదాపు సగం.