Mudigonda Accident: ఖమ్మం జిల్లా ముదిగొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ జాతీయ రహదారిపై గ్రానైట్ రాళ్ల లోడుతో వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో గ్రానైట్ రాళ్ల లోడుతో సహా రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో వీరన్న, హుస్సేన్ అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.