విద్యాశాఖ ఉన్నతాధికారులతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి.. అవసరమైన స్థలాల సేకరణ, ఇతర పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.