కొత్త రేషన్ కార్డులు, మార్పులు చేర్పుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో ప్రజలు మీసేవ కేంద్రాలకు కూకట్టారు. ప్రభుత్వం ఎలాంటి గడువు విధించకపోయినా.. మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో ఇదే అదునుగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తూ.. జేబులు నింపుకుంటున్నారు.