స్వచ్ఛత వైపు పయనం..
‘మొక్కల పెంపకం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో మెరుగైన ఆరోగ్యం జీవనం పెంపొందించుకోవాలి. కలుషితమైన గాలి, పంట ఉత్పత్తుల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు అధికంగా వినియోగించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రజల జీవన శైలిలో మార్పులు రావాలి. పంటల్లో రసాయనాల వినియోగంతో క్యాన్సర్ బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి స్వచ్ఛత వైపు పయనించాలి’ అని సీబీఎన్ సూచించారు.