ఊహించిందే జరుగుతోంది! దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వస్తున్న రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లకు భారతీయుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. వాలెంటైన్స్ డే నేపథ్యంలో మహీంద్రా బీఈ6, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈల బుకింగ్స్ని సంస్థ ప్రారంభించగా.. ఈ రెండింటికీ మొదటి రోజే 30,179 బుకింగ్స్ దక్కాయి. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీల బుకింగ్ వాల్యూ రూ. 8,472 కోట్ల (ఎక్స్షోరూం ధర)కు చేరింది. ఈ 30,179 బుకింగ్స్లో 44శాతం మంది బీఈ 6ని ఎంచుకోగా, మిగిలిన 56శాతం మంది ఎక్స్ఈవీ 9ఈని బుక్ చేసుకున్నారు. అంతేకాదు, మొత్తం మీద 79శాతం బుకింగ్స్ టాప్ ఎండ్ వేరియంట్స్కే వెళ్లడం విశేషం.