డీఈవోకు నివేదిక..
ఈ ఘటనపై ఎంఈవో సత్యనారాయణ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఈ వార్తా వైరల్ అయిందని, దాని ఆధారంగా పాఠశాలకు వచ్చి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. పీఈటీ నూకరాజు విద్యార్థినుల పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవరించినట్లు తేలిందన్నారు. ఈ నివేదికను జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో)కు అందజేస్తానని స్పష్టం చేశారు. తదుపరి చర్యలు డీఈవో తీసుకుంటారని వివరించారు.