గ్రామస్తులు, బాధిత వంట మనిషితో పోలీసులు మాట్లాడి వివరాలన్ని సేకరించారు. అనంతరం ఉపాధ్యాయుడు రవి కుమార్ను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. సమాచారం అందుకున్న మండల విద్యా శాఖ అధికారి (ఎంఈవో) వస్త్రాం నాయక్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయుడు తమ గ్రామంలో పని చేస్తున్నాడని, విద్యార్థులు, స్థానికులపట్ల అగౌరవంగా, అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో ఆ ఉపాధ్యాయుడు కొన్ని రోజులు సస్పెండ్ కూడా అయ్యారని కాలనీ వాసులు తెలిపారు.