కాంగ్రెస్ హయాంలోనే..
‘1994లో గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పటి కాంగ్రెస్ సీఎం ఛబీల్దాస్ మెహతా హయాంలోనే మోదీకి సంబంధించిన కులాన్ని బీసీలోకి చేర్చారు. 1970 తర్వాతే అనంత్రామన్ కమిషన్ బీసీ కులాలను వెలుగులోకి తీసుకువచ్చింది. అప్పటివరకు 93 బీసీ కులాలుంటే.. ఆ తర్వాత 118కి పెరిగాయి. గౌడ, ముదిరాజ్, మున్నూరుకాపు, యాదవ ఇతరత్రా బీసీ కులాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వీరందరినీ రేవంత్ కన్వర్టెడ్ బీసీలుగా పరిగణిస్తున్నారా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.