తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కింది. రాష్ట్రంలో మండలానికి ఒక్క గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో 71,482 మంది లబ్ధిదారులు మొదటి విడతలో ఎంపికయ్యారు. వీరందరికీ ప్రోసిడింగ్స్ కాపీలు అందిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారుల గుర్తింపు కోసం కసరత్తు జరుగుతోంది.