Traffic Diversions : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారి 65పై వాహనాలను మళ్లిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జాతర జరిగే ప్రదేశం సూర్యాపేట పట్టణానికి 3 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి ఎన్.హెచ్ 65 పై ఉంటుంది కావున వాహనాల మళ్లింపునకు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి ఆంక్షలు విధించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here