మళ్లీ విచారణ జరిపి..
గన్నవరంకు చెందిన రంగబాబు అనే వ్యక్తి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. గతంలో ఆయన వల్లభనేని వంశీకి అనుచరుడిగా ఉండేవారు. అయితే.. యార్లగడ్డ వెంకట్రావు తోపాటు రంగబాబు కూడా టీడీపీలో చేరారు. రంగబాబుపై వంశీ తన అనుచరులతో దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు దీనిపై కేసు నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ విచారణ జరిపి.. హత్యాయత్నం కింద 307 సెక్షన్ను చేర్చారు. ఇందులోనూ వంశీని కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం.