వరస హిట్స్తో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్హిట్ అయిన సినిమాలు చాలా వున్నాయి. అలా సంక్రాంతి అనేది ఆయనకు సెంటిమెంట్గా మారింది. దాన్నే కంటిన్యూ చేస్తూ ఈ ఏడాది సంక్రాంతికి కూడా మరో సూపర్హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో బాబీ దర్శకత్వంలో రూపొందిన ‘డాకు మహారాజ్’ బ్లాక్బస్టర్ హిట్ టాక్ సంపాదించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా తన సత్తా చాటింది. ఈ సినిమా విజయంతో బాలయ్య రెండో హ్యాట్రిక్కి శ్రీకారం చుట్టారు.
శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి రిలీజ్కి ముందే మంచి హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే థియేటర్లలో విపరీతమైన సందడి చేసింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమాలో బాలయ్య పెర్ఫార్మెన్స్కి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే.. థమన్ మ్యూజిక్. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాకి మంచి ఎలివేషన్ తీసుకొచ్చిన థమన్కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. బాలకృష్ణ సినిమాలకు వరసగా మ్యూజిక్ చేస్తూ వస్తున్న థమన్ ప్రతి సినిమానూ మ్యూజికల్గా హైలైట్ చేస్తున్నారు. తనకు అంత సపోర్ట్ చేస్తున్న థమన్కి ఇటీవల బాలయ్య ఒక లగ్జరీ కారును బహుమతిగా అందించారు.
ఇదిలా ఉంటే.. థియేటర్లలో సందడి ముగిసిన తర్వాత ఓటీటీలోకి సినిమా ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురుచూడడం సహజమే. ‘డాకు మహారాజ్’ థియేటర్ హడావిడి ముగిసింది. ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన నెలరోజులు దాటిపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్పైకి ఎప్పుడు వస్తుంది అనే సస్పెన్స్ నిన్నటి వరకు కొనసాగింది. అదే సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్కి సంబంధించి ఏదో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. దానికి ఫుల్స్టాప్ పెడుతూ ఓటీటీ స్ట్రీమింగ్పై మేకర్స్ ఓ అధికార ప్రకటన చేశారు. నెట్ఫ్లిక్స్లో ‘డాకు మహారాజ్’ చిత్రాన్ని ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారంటూ అభిమానులకు శుభవార్త తెలియజేశారు. నిన్నటి వరకు థియేటర్లలో సందడి చేసిన డాకు.. ఇక ఓటీటీలో సందడి చేయబోతున్నాడన్నమాట.