కఠిన చర్యలు తీసుకోవాలి
ఎన్నికల ఖర్చు, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఆర్థిక పారదర్శకత పాటించాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్, ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నించిన పార్టీలు, ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నాయని ఆరోపించిన విషయాన్ని తన వీడ్కోలు ప్రసంగంలో గుర్తు చేశారు రాజీవ్ కుమార్. పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకు దూరంగా ఉండాలని కోరారు.