AP Farmers Subsidies : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 2025-26కు సంబంధించి సబ్సిడీలు ఖరారయ్యాయి. సూక్ష్మ, బిందు సేద్యం చేసే రైతులకు డ్రిప్, స్పింక్లర్ల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఎస్సీ, ఎస్టీల్లో చిన్న, మధ్యస్థ రైతులకు 5 ఎకరాల వరకు 100 శాతం, ఇతర చిన్న, మధ్యస్థ రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులు, ఐటీడీఏ పరిధిలో 5-10 ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఖరారు చేశారు.
Home Andhra Pradesh ఏపీ సూక్ష్మ, బిందు సేద్యం రైతులకు గుడ్ న్యూస్-సబ్సిడీలు ఖరారు చేసిన ప్రభుత్వం-good news for...