టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ మోడ్రన్ రెట్రో మోటార్ సైకిల్ టీవీఎస్ రోనిన్ 2025 ఎడిషన్ను భారతదేశంలో విడుదల చేసింది. కొత్త రోనిన్ కొన్ని ప్రధాన అప్డేట్స్తో వస్తుంది. ఇది మరింత స్టైలిష్గా, సురక్షితంగా ఉంటుంది. టీవీఎస్ కంపెనీ టీవీఎస్ రోనిన్ మోడల్ కోసం గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ అంబర్ అనే రెండు కొత్త బ్రిలియంట్ కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. మిడ్ వేరియంట్లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్, సేఫ్టీ ఉన్నాయి. ఇందులో ఉన్న శక్తివంతమైన ఇంజిన్, అధునాతన ఫీచర్ల కారణంగా రైడింగ్ మరింత హాయిగా అనిపిస్తుంది.