చర్మం రంగు మారితే
చర్మంపై నీలి, ఎరుపు రంగు మచ్చలు వస్తున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా తొడలు, పాదాలు, వేలు, పిరుదులు, కాళ్లు వంటి భాగాలపై ఈ నీలి, ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మచ్చలు వస్తే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇలా నీలి, ఎరుపు రంగు మచ్చలు కనబడడం ఏమాత్రం మంచిది కాదు. వైద్యులు చెబుతున్న ప్రకారం ఇది అత్యవసర వైద్య సహాయం అవసరం అయ్యే సంకేతం కూడా కావచ్చు.