ప్రస్తుతం పదెకరాల్లో వరి, ఐదెకరాల్లో పామాయిల్, అరటి, కోకోను మిశ్రమ పంటగా సాగు చేస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానంలో ఆవులు, కోళ్లు, మేకలు, చేపల పెంపకం నిర్వహించారు. గతంలో పసకొమ్ము వంటి నూతన పంటలను సాగు చేసి ఇన్నోవేషన్ ఫార్మర్ అవార్డు సాధించగా, పదేళ్లుగా రసాయనాలు లేని పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలువడంతో ఫెలో పార్మర్ అవార్డును సొంతం చేసుకున్నారు. వంటిమామిడి వద్ద వంద ఎకరాల భూమిని లీజుకు తీసుకుని సమీకృత వ్యవసాయం చేసేందుకు ఓ సంస్థతో ఒప్పందం చేసుకొని పంటలను కల్టివేషన్ చేస్తున్నారు.