సీఎం రేసులో వీరే..
న్యూఢిల్లీ స్థానం నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా, రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, మాలవీయ నగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్, జనక్ పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్, ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, ఘోండా ఎమ్మెల్యే అజయ్ మహావర్ తదితరులు సీఎం రేసులో ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో జాట్, దళిత, పూర్వాంచలి, సిక్కు, ఉత్తరాఖండ్ వలసదారులు, బనియాలకు ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉందని బిజెపి నాయకులు తెలిపారు.