అర్హులైన అన్నదాతలకు మార్చి నెల మొదటి వారంలోగా.. రైతు భరోసా సాయం విడుదల చేయాలని.. ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విడతల వారీగా నిధులు విడుదలైనా.. ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తాజాగా సచివాలయంలో రైతు భరోసాపై ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.