శౌర్యం, ధైర్య సాహసాలకు పేరుగాంచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన ఎనిమిది వివాహాలు చేసుకున్నారు. అందులో ఎక్కువ భాగం రాజకీయ లబ్ధి కోసమే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ ఎనిమిది వివాహాల వల్ల శివాజీకి ఆరుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్ద కుమారుడు శంభాజీ. శంభాజీ శివాజీ పెద్ద భార్య అయినా సాయి బాయికి జన్మించారు. 1657లో శంభాజీ జన్మించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. దాంతో అమ్మమ్మ ఆయన జీజాబాయి దగ్గరే పెరిగారు.