బ్యాటింగ్ అదుర్స్
టీమ్ఇండియా బ్యాటింగ్ కు తిరుగేలేదు. కెప్టెన్ రోహిత్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్ లో సెంచరీతో రోహిత్, హాఫ్ సెంచరీతో కోహ్లి ఫామ్ అందుకున్నారు. ఇక శుభ్ మన్, శ్రేయస్ నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. గత మూడు మ్యాచ్ ల్లో శ్రేయస్ వరుసగా 59, 44, 78 పరుగులు చేశాడు. గిల్ ఏమో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.