కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది. 2024లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో సంభవించిన విపత్తులకు కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో ఆకస్మిక వరదలతో పాటు కొండ చరియలు విరిగి పడటం లాంటి ప్రకృతి విపత్తులు సంభవించారు. మరో మూడు రాష్ట్రాలకు కలిపి నిధులు రిలీజ్ చేసింది.