విద్యార్థులకు ఉపయోగం..
చదువుకున్న సమయంలోనే ఇలాంటి యాత్రల ద్వారా విద్యార్థులకు చాలా విషయాలు తెలుస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు విజ్ఞాన యాత్రలకు నిధులు కేటాయించడం మంచి పరిణామని టీచర్లు చెబుతున్నారు. విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకే పరిమితం అయిన విద్యార్థులకు ఈ యాత్రలు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.