తెలుగు రాష్ట్రాల్లో..
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణి ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొందరు కేటుగాళ్లు నకిలీ కరెన్సీతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీలో ఏలూరు, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చాలామందిని పోలీసులు అరెస్టు చేశారు. భారీ మొత్తంలో దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ 10 విషయాలు తెలుసుకుంటే.. నకిలీ కరెన్సీని గుర్తించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ఓ పోలీస్ అధికారి చెప్పారు.